TRS MLA కు ఉపరాష్ట్రపతి ప్రశంస

ABN , First Publish Date - 2021-07-27T14:08:09+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే...

TRS MLA కు ఉపరాష్ట్రపతి ప్రశంస

హైదరాబాద్ సిటీ/యూసుఫ్‌గూడ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ప్రశంసించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసీమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 2,425 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ప్రశంశిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస పత్రాన్ని పంపించారు.



Updated Date - 2021-07-27T14:08:09+05:30 IST