చక్రస్నానంతో ముగిసిన వెల్లాల బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-05-21T04:43:27+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్స వాలు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి.
రాజుపాళెం, మే 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెన్నకేశవ, సంజీవరాయస్వామి బ్రహ్మోత్స వాలు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. శుక్రవారం చక్రస్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఛైర్మన్ కానాల విజయలక్ష్మి, ఈఓ శోభ తెలిపారు. స్వామివారిని ముందుగా ఊరేగిస్తూ వసంతాలు చల్లుకుంటూ ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు. కార్యక్రమంలో అర్చకులు శేషాచార్యులు, వీణాచార్యులు, పవనాచార్యులు, నరసింహస్వా మి, చలపతి, తదితర అర్చకులు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.