ఇష్టారాజ్యంగా కూరగాయల ధరల వసూళ్లు
ABN , First Publish Date - 2020-03-26T06:39:54+05:30 IST
రైతుబజార్లు, ఇతర మార్కెట్లలో కూరగాయలు, నిత్యవసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తోన్నా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు.
గుంటూరు(ఆంధ్రజ్యోతి): రైతుబజార్లు, ఇతర మార్కెట్లలో కూరగాయలు, నిత్యవసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయిస్తోన్నా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. వ్యాపారులు దుకాణానికో రేటు అమ్ముతున్నారు. నగరపాలకసంస్థకు ఎదురే ఉన్నా కేవలం షాపుల అద్దెలకే వసూళ్లకే ఆ సంస్థ పరిమితం అవుతోన్నది.