గుత్తి వైస్‌ చైర్‌పర్సనగా వరలక్ష్మి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-07-31T06:36:00+05:30 IST

పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో శుక్రవారం మున్సిపల్‌ రెం డవ చైర్‌పర్సనగా బిందే వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు.

గుత్తి  వైస్‌ చైర్‌పర్సనగా వరలక్ష్మి ప్రమాణస్వీకారం
ప్రమాణ స్వీకారం చేస్తున్న వరలక్ష్మి

గుత్తి, జూలై 30: పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో శుక్రవారం మున్సిపల్‌ రెం డవ చైర్‌పర్సనగా బిందే వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలక్షన అధికారి యుగంధర్‌ వరలక్ష్మి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె ఎమ్మెల్యే వై వెంకటరామి రెడ్డి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్‌పర్సన వన్నూరుబీ, వైస్‌ చైర్‌పర్సన పద్మలత, పట్టణ కన్వీనర్‌ హుసేనపీరా, నియోజకవర్గ వైసీపీ నాయకులు మంజునాథరెడ్డి, డీ ఈ శేఖర్‌, శానిటరీ ఇనస్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఏఈ శరతచంద్ర, వైసీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్‌ యాదవ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:36:00+05:30 IST