చిరస్మరణీయుడు వాజపేయి
ABN , First Publish Date - 2022-08-17T05:45:12+05:30 IST
దేశ పురోగతికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు దొంగ నర్శింహకుమార్, వీరాజీ అన్నారు.
యలమంచిలి, ఆగస్టు 16: దేశ పురోగతికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు దొంగ నర్శింహకుమార్, వీరాజీ అన్నారు. మేడపాడులో వాజపేయి వర్థంతిని మంగళవారం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుక్కల కేశవరావు, అడ్డాల లక్ష్మీనారాయణ, కారిచర్ల పతంజలి, వల్లభు గణేష్, ముద్దల సాయి పాల్గొన్నారు.
ఆచంట: మండలంలో వాజపేయి వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి పూల మాలలు వేశారు. ముచ్చర్ల నాగ సుబ్బారావు, రామిశెట్టి రామచంద్రరావు, జీఎన్వీ, వేండ్ర సిద్ధయ్య, పాల్గొన్నారు.
తణుకు: మాజీ ప్రధాని వాజపేయి దేశ సత్తాను ప్రపంచానికి చాటారని మాజీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ అన్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద వాజ పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్తిరాజు సుబ్రహ్మణ్యం, పొలిశెట్టి బాలాజీ, నిలాపు దుర్గారావు, సత్యనారాయణరాజు పాల్గొన్నారు.