విలువలకు నిలువెత్తు రూపం వాజ్పేయి
ABN , First Publish Date - 2022-08-17T05:15:44+05:30 IST
విలువలకు నిలువెత్తు రూపం వాజ్పేయి
కందుకూరు/యాచారం/ఆమనగల్లు/షాద్నగర్ అర్బన్, ఆగస్టు 16: దేశ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు రూపం మాజీ ప్రధాని అటల్బిహారి వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్మటి దేవేందర్రెడ్డి, జిల్లా పంజాయతీరాజ్ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, జిల్లా నాయకులు మంద పాండులు కొనియాడారు. మంగళవారం వాజ్పేయి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బొక్క సత్యనారాయణరెడ్డి, కె.సుధాకర్రెడ్డి, ఎస్.భూమిరెడ్డి, చెన్నారెడ్డి, పి.మహిపాల్రెడ్డి, కుమ్మరి రాంచంద్రయ్య పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల శ్రీశైలం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నడికూడి కృష్ణ, నాయకులు పురుశోత్తం, ఆర్.విజయ్కుమార్, నాగరాజు ఉన్నారు. అదేవిధంగా ఆమనగల్లులో ఎన్బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి వాజ్పేయికి నివాళులర్పించారు. పట్టణంలో పలు చోట్ల మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు గోరటి నర్సింహ, శ్రీకాంత్సింగ్, చెన్నకేశవులు, దుడ్డు కృష్ణయాదవ్, విక్రమ్రెడ్డి, రాములు, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా షాద్నగర్ చౌరస్తాలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి నెల్లి శ్రీవర్దన్రెడ్డి నివాళులర్పించారు. పాలమూరు విష్ణువర్దన్రెడ్డి, అందె బాబయ్య, దేపల్లి అశోక్గౌడ్, కె.మనోహర్రెడ్డి, వంశీకృష్ణ, రుషీకేష్, వెంకటేష్, కురుమయ్య, మురళీ పాల్గొన్నారు.