జిల్లాలో 4,90,509 మందికి వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-04-17T05:55:34+05:30 IST
కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోందని, గురువారం నాటికి జిల్లాలో 4,90, 509 మందికి కరోనాటీకా వేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారి సుహాసిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
డీఎంఅండ్హెచ్వో సుహాసిని
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోందని, గురువారం నాటికి జిల్లాలో 4,90, 509 మందికి కరోనాటీకా వేసినట్లు జిల్లా వైద్యశాఖాధికారి సుహాసిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని ఆమె కోరారు. జిల్లాలో మొదటివిడత డోసు 3,62,739 మంది తీసుకున్నారని, రెండో డోసు 46,770 మంది తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీనుంచి 14వతేదీ వరకు జరిగిన టీకాఉత్సవ్లో 62 వేలమందికి కరోనా టీకా వేశామన్నారు. వైద్యశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా సోకకుండా ప్రతిఒక్కరూమాస్క్లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆమె కోరారు.