వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2021-01-16T05:13:55+05:30 IST

జడ్పీ సీఈవో, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నోడల్‌ అధికారి పి. సుశీల శుక్రవారం నాయుడుపేట పీహెచ్‌సీ సెంటర్‌లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

నాయుడుపేట, జనవరి 15 : జడ్పీ సీఈవో, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నోడల్‌ అధికారి పి. సుశీల శుక్రవారం నాయుడుపేట పీహెచ్‌సీ సెంటర్‌లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు.  స్థానిక పీహెచ్‌సీ సెంటర్‌లో శనివారం వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె వైద్యాధికారులకు పలు సూచనలు  ఇచ్చారు. 

కోట : కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, మండలంలోని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వ ఉంచిన కరోనా వ్యాక్సిన్‌ను శుక్రవారం జడ్పీ సీఈవో పీ సుశీల  పరిశీలించారు. 

డక్కిలి : మండలంలో  శనివారం నుంచి మూడు రోజుల పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు స్థానిక వైద్యాధికారి సుధీర్‌ బాబు తెలిపారు. తొలి రోజు 231  మందికి,  ఆదివారం 95  మందికి, సోమవారం 60 మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-01-16T05:13:55+05:30 IST