వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో
ABN , First Publish Date - 2021-01-16T05:13:55+05:30 IST
జడ్పీ సీఈవో, కొవిడ్ వ్యాక్సినేషన్ నోడల్ అధికారి పి. సుశీల శుక్రవారం నాయుడుపేట పీహెచ్సీ సెంటర్లోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
నాయుడుపేట, జనవరి 15 : జడ్పీ సీఈవో, కొవిడ్ వ్యాక్సినేషన్ నోడల్ అధికారి పి. సుశీల శుక్రవారం నాయుడుపేట పీహెచ్సీ సెంటర్లోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక పీహెచ్సీ సెంటర్లో శనివారం వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె వైద్యాధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
కోట : కోటలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, మండలంలోని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వ ఉంచిన కరోనా వ్యాక్సిన్ను శుక్రవారం జడ్పీ సీఈవో పీ సుశీల పరిశీలించారు.
డక్కిలి : మండలంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు స్థానిక వైద్యాధికారి సుధీర్ బాబు తెలిపారు. తొలి రోజు 231 మందికి, ఆదివారం 95 మందికి, సోమవారం 60 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు.