అత్యుత్తుమ స్థాయికి కృష్ణపట్నం పోర్టు
ABN , First Publish Date - 2021-01-27T02:54:40+05:30 IST
దేశంలోనే అత్యుత్తమ స్థాయికి కృష్ణపట్నం పోర్టు అభివృద్థి చెందుతుందని కేపీసీఎల్ ఎండీ జీజే రావు పేర్నొన్నారు. కృష్ణపట్నం పోర్టు
- ఎండీ జీజే రావు
ముత్తుకూరు, జనవరి26: దేశంలోనే అత్యుత్తమ స్థాయికి కృష్ణపట్నం పోర్టు అభివృద్థి చెందుతుందని కేపీసీఎల్ ఎండీ జీజే రావు పేర్నొన్నారు. కృష్ణపట్నం పోర్టులో మంగళవారం నిర్వహించిన గణతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవయుగ ఆధ్వర్యంలో వేగంగా అభివృద్థి చెందుతున్న కృష్ణపట్నం పోర్టు ప్రస్తుతం అదానీ గ్రూప్తో భాగమై, మరింత అభివృద్థి దిశగా అడుగులు వేస్తుందన్నారు. సీఎస్ఆర్ పనుల్లో భాగంగా విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందికి బహుమతులను ప్రదానం చేశారు. సీవీఆర్ అకాడమీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నావల్ కమాండర్ అఖిల్ చక్రవర్తి, సీవోవో గాంధీ, హెచ్ఆర్ హెడ్ గణేశ్ శర్మ, సీఆర్ హెడ్ వేణుగోపాల్, రాకేష్కృష్ణన్, మనోహర్బాబు, తదితరులు పాల్గొన్నారు.