బీమా పథకాన్ని వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-31T05:01:28+05:30 IST

బీమా పథకాన్ని వినియోగించుకోవాలి

బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌

వికారాబాద్‌: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఉన్న 3 రకాల బీమా పథకాలను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎస్‌బీఐ బ్యాంకు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ బీమా పథకాలను వివరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ బ్యాంకు ఏజీఎం రజిని, ఎల్డీఎం రాంబాబు, మేనేజర్‌ విజయ్‌కుమార్‌, మెప్మాసభ్యులు వెంకటేష్‌, రవి, ఆర్పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:01:28+05:30 IST