WHO: ఆ ఐదు దేశాల్లో అత్యధిక కరోనా కేసులు..లిస్టులో భారత్!

ABN , First Publish Date - 2021-08-13T01:43:49+05:30 IST

అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో గత వారం అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) తాజాగా పేర్కొంది.

WHO: ఆ ఐదు దేశాల్లో అత్యధిక కరోనా కేసులు..లిస్టులో భారత్!

జెనీవా: అమెరికా, భారత్, ఇరాన్, బ్రెజిల్, ఇండోనేషియా దేశాల్లో గత వారం అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) తాజాగా పేర్కొంది. అయితే..భారత్, ఇండియా, ఇండోనేషియాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోందని పేర్కొంది. అమెరికాలో కొత్త కేసుల్లో 35 శాతం పెరుగుదల నమోదైందని కూడా పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం..  ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న కరోనా వేరియంట్ గత వారం కొత్తగా ఏడు దేశాల్లో అడుగుపెట్టింది. దీంతో..డెల్టా కాటుకు గురైన దేశాల సంఖ్య 142కు చేరింది. మరోవైపు.. మునుపటి స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ వైరస్ బారిన పడ్డ వారిలో వైరల్ లోడ్ వెయ్యి రెట్లు అధికంగా ఉంటోందని ఓ అధ్యయనంలో తేలిన విషయాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావించింది. 

Updated Date - 2021-08-13T01:43:49+05:30 IST