శ్రీవారి సేవలో ‘ఉప్పెన’ సినీ బృందం

ABN , First Publish Date - 2021-02-27T15:05:55+05:30 IST

ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృత్తిశెట్టి, దర్శకుడు అంజి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో ‘ఉప్పెన’ సినీ బృందం

తిరుమల:  తిరుమల శ్రీనివాసుడిని ‘ఉప్పెన’ చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృత్తిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఉప్పెన చిత్రం స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందడంతో చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. తన తదుపరి చిత్రం స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందానన్నారు. త్వరలోనే చిత్ర వివరాలను వెల్లడిస్తానని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. చిత్ర బృందంతో పాటు  ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T15:05:55+05:30 IST