ఉపాధి సొమ్ముల రికవరీకి పీడీ ఆదేశం

ABN , First Publish Date - 2022-05-25T05:34:31+05:30 IST

బిక్కవోలులో మంగళవారం నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిబ్బంది చేసిన అవతవకలకు వారి నుంచి రూ. 27వేల 527లు రికవరీ చేయాలని పీడీ పి. జగదాంబ ఆదేశించారు.

ఉపాధి సొమ్ముల రికవరీకి పీడీ ఆదేశం

బిక్కవోలు, మే 24: బిక్కవోలులో మంగళవారం నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిబ్బంది చేసిన అవతవకలకు వారి నుంచి రూ. 27వేల 527లు రికవరీ చేయాలని పీడీ పి. జగదాంబ ఆదేశించారు. ఆమె అధ్యక్షతన ప్రజా వేదిక నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఆర్‌పీ గోవిందు మాట్లాడుతూ 2020, 2021 సంవత్సరాల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో రూ. 15కోట్ల మేర పనులు జరిగాయన్నారు. వీటిని తమ సిబ్బంది ఈనెల 17 నుంచి 21 వరకూ అన్ని గ్రామాల్లో తనిఖీలు జరపగా రూ. 8,20,856 పనుల్లో తేడాలు గమనించి ఇందుకు కారకులైన సిబ్బంది నుంచి రూ.27,527లు రికవరీ చేయాలని సిఫార్సు చేస్తున్నామన్నారు.  రూ.2,76,262 పనులకు సరిచేసుకోవాలని అన్నారు. సిబ్బంది పొరపాట్లకు రూ. 7,500లు ఫైన్‌ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజేష్‌, ఏపీవో వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-25T05:34:31+05:30 IST