యూపీలో విజృంభించిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-06T01:46:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు గత 24 గంటల్లో భారీగా నమోదయ్యాయి. 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం..

యూపీలో విజృంభించిన కరోనా కేసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు గత 24 గంటల్లో భారీగా నమోదయ్యాయి. 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,167కు చేరినట్టు అధికారులు తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 18,761 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరగా, రాష్ట్రంలో మృతుల సంఖ్య 785కు చేరింది. శనివారం ఒక్కరోజే 29,117 కరోనా పరీక్షలు జరిపినట్టు హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అశ్విన్ అవస్థి తెలిపారు.


కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 6,73,165 కరోనా కేసులు ఇంతవరకూ నమోదా కాగా, ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,09,083 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 19,268కి చేరింది.

Updated Date - 2020-07-06T01:46:23+05:30 IST