ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-17T01:47:32+05:30 IST

కరోనా కేసులో ఉత్తరప్రదేశ్ వణుకుతోంది. రికార్డు స్థాయిలో అక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

లక్నో: కరోనా మహమ్మారి విజృంభణతో ఉత్తరప్రదేశ్ వణుకుతోంది. రికార్డు స్థాయిలో అక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నేడు ఒక్క రోజే ఏకంగా 27,426 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, 103 మంది వైరస్‌కు బలయ్యారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాకు బలైనవారి సంఖ్య 9,583కు పెరిగింది.


రాష్ట్రంలో ఇంకా 1,50,676 కేసులు క్రియాశీలంగా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 6,33,461 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,96,675 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 14,87,037 మంది వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నట్టు ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (హెల్త్) అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.  

Updated Date - 2021-04-17T01:47:32+05:30 IST