లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించారని గాడిదపై ఊరేగింపు
ABN , First Publish Date - 2020-04-01T18:09:34+05:30 IST
యూపీలోని మీరట్ లో పోలీసులు లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించిన ఇద్దరు యువకులను గాడిదలపై ఊరేగించారు. తరువాత వారికి క్లాస్ పీకారు.
మీరట్: యూపీలోని మీరట్ లో పోలీసులు లాక్ డౌన్ నియమాలను ఉల్లఘించిన ఇద్దరు యువకులను గాడిదలపై ఊరేగించారు. తరువాత వారికి క్లాస్ పీకారు. ఆపై హెచ్చరిక పేరిట వంద రూపాయలు వసూలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఇద్దరు యువకులు గాడిదలపై కూర్చున్న దృశ్యం కనిపిస్తోంది. రెండవ వీడియోలో పోలీసులు ఆ ఇద్దరు యువకులకు బుద్ధి చెబుతున్న దృశ్యం ఉంది. దీనితో ఆ ఇద్దరు యువకులు తమ చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పారు.