ఆరేళ్ల కుమారుడి ముందే భార్యను కొట్టి చంపిన భర్త.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-06-05T00:48:47+05:30 IST

ఆరేళ్ల కుమారుడి ముందే భార్యను అత్యంత క్రూరంగా కొట్టి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని

ఆరేళ్ల కుమారుడి ముందే భార్యను కొట్టి చంపిన భర్త.. వీడియో వైరల్

లక్నో:  ఆరేళ్ల కుమారుడి ముందే భార్యను అత్యంత క్రూరంగా కొట్టి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా కొరిహార్ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమారుడు, గ్రామస్థులు చూస్తుండగానే భార్య సంగీతను చితకబాదాడు. భార్యను అతడు కొట్టి చంపుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘అతడు పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు. మంగళవారం సాయంత్రం భార్యను కొట్టడం ప్రారంభించాడు. తనను రక్షించమని ఆమె ధర్మరాజు తల్లిదండ్రులను వేడుకున్నా వారేమీ చేయలేకపోయారు. ఉదయం ఆమె చనిపోయిందని తెలిసింది’’ అని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-05T00:48:47+05:30 IST