Lucknow: సినీనటి కంగనాకు యూపీ సీఎం యోగి ఏం బహుమతి ఇచ్చారంటే...
ABN , First Publish Date - 2021-10-02T13:45:31+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన బహుమతి ఇచ్చారు...
లక్నో (ఉత్తరప్రదేశ్): బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన బహుమతి ఇచ్చారు.కంగనారనౌత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన సందర్భంగా అయోధ్యలోని రామమందిర భూమి పూజలో ఉపయోగించిన శ్రీరామచంద్రుని నాణాన్ని బహుమతిగా అందజేశారు. సీఎం యోగి బహుమతిగా ఇచ్చిన రామచంద్రుడి నాణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న కంగనా వ్యాఖ్యలు చేశారు. ‘‘నాడు శ్రీరామచంద్రుడి లాగా నేడు తపస్వీ యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్నారని, మహారాజ్ పాలనను కొనసాగించనివ్వండి’’ అంటూ కంగనారనౌత్ వ్యాఖ్యానించారు.
మొరాదాబాద్ నగరంలో తేజస్ చిత్రం షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత సినీనటి కంగనా ఉత్తర ప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోకు వచ్చి సీఎం యోగిని కలిశారు.తన చిత్ర బృందానికి సహాయం చేసినందుకుగాను ఆమె యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కంగనా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్లి యోగితో దిగిన ఛాయాచిత్రాలను పంచుకుంది. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2022 లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు కంగనా పేర్కొంది.