ప్రియాంకగాంధీ సారథ్యంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరు: లల్లూ

ABN , First Publish Date - 2020-07-12T21:05:10+05:30 IST

2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సారథ్యంలో పోరాడాలని యూపీ

ప్రియాంకగాంధీ సారథ్యంలో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరు: లల్లూ

లక్నో: 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సారథ్యంలో పోరాడాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ పేర్కొన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పార్టీ పొత్తు పెట్టుకోవద్దని, కేవలం ప్రజలు, ప్రజాస్వామ్యం, యువత, రైతులు, పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలతోనే పొత్తు పెట్టుకోవాలని అన్నారు. 


‘‘ప్రియాంక గాంధీ యూపీ వారే. ఇక్కడి మట్టితోను, ఇక్కడి కోట్లాది మంది ప్రజలతోను ఆమెకు, ఆమె కుటుంబానికి అనుబంధం ఉంది. రాష్ట్రంలోని కోట్లాదిమంది ప్రజల గుండెల్లో ఆమె ఉన్నారు. ఎటువంటి సందేహం లేకుండా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోనే పార్టీ బరిలోకి దిగాలి’’ అని లల్లూ పేర్కొన్నారు. పార్టీ ముఖచిత్రం ప్రియాంక గాంధీయేనని, పార్టీ ప్రజల గొంతుక అవుతుందని, ప్రజలు తమ ఆశీర్వాదాన్ని తమపై ఉంచుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-12T21:05:10+05:30 IST