టీఆర్‌ఎ్‌సను ఎదురులేని శక్తిగా తయారు చేయాలి

ABN , First Publish Date - 2022-08-14T05:02:51+05:30 IST

టీఆర్‌ఎ్‌సను ఎదురులేని శక్తిగా తయారు చేయాలి

టీఆర్‌ఎ్‌సను ఎదురులేని శక్తిగా తయారు చేయాలి
సబితారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరుతున్న రావిరాల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు

  • పార్టీలోకి బీజేపీ నాయకుల చేరిక సందర్భంగా మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం, ఆగస్టు 13: మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దాలని, పార్టీని నమ్ముకున్న వారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తుక్కుగూడ మున్సిపాలి టీ పరిధి రావిరాలకు చెందిన పలువురు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంత్రి నివాసానికి వెళ్లి టీఆర్‌ఎ్‌సలో చేరారు. మం త్రి వారితో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అనేక రకాల అభివృద్ధి, సం క్షేమ పథకాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యక్తలు టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారన్నారు. అలాగే నియోజకరవ్గంలో టీఆర్‌ఎ్‌సను మరింత బలోపేతం చేసేందుకు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని అన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యక్తలు కృషిచేయాలని ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. కా ర్యక్రమంలో సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ రెడ్డిగల్ల రత్నం, నాయకులు బా ట సురేష్‌, బుచ్చిరెడ్డి, రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, నాగేష్‌, లింగం, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:02:51+05:30 IST