లడఖ్ను కుదిపేసిన భూకంపం
ABN , First Publish Date - 2020-09-25T23:46:03+05:30 IST
శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం లడఖ్ను కుదిపేసింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.4గా నమోదైంది.
న్యూఢిల్లీ : శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం లడఖ్ను కుదిపేసింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.4గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 4.27 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం సంభవించలేదు.
లేహ్ నుంచి 129 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో ఇది ప్రారంభమైందని చెప్పింది.
లేహ్లోని స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన చిత్రాలనుబట్టి భవనాల గోడలు పగిలినట్లు కనిపించింది. ప్రాణ నష్టం, ప్రజలు గాయపడటం వంటి సంఘటనల గురించి సమాచారం లేదు.
జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్లో బుధవారం 3.6 తీవ్రతగల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.