‘న్యూయార్క్ టైమ్స్’పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింగ్
ABN , First Publish Date - 2022-01-30T02:28:40+05:30 IST
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్లో పర్యటించినపుడు ఇరు దేశాలు కుదుర్చుకున్న
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్లో పర్యటించినపుడు ఇరు దేశాలు కుదుర్చుకున్న దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో పెగాసస్ స్పైవేర్ కూడా ఓ భాగమని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంచలన కథనంపై కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘న్యూయార్క్ టైమ్స్’ను ‘సుపారీ మీడియా’గా అభివర్ణించారు.
భారత దేశంతోపాటు అనేక దేశాల్లో ఈ స్పైవేర్ను ఉపయోగించి పాత్రికేయులు, మానవ హక్కుల మద్దతుదారులు, రాజకీయ నేతలు, ఇతర అధికారులపై నిఘా పెడుతున్నట్లు గత ఏడాది వార్తలు రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన వ్యక్తమైంది. తాజాగా, న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన మంత్రి.. ‘‘మీరు దానిని నమ్ముతున్నారా? అది ‘సుపారీ మీడియా’గా అందరికీ తెలుసు’’ అని పేర్కొన్నారు.