కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-13T00:55:10+05:30 IST

కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే ప్రకటించారు. ఉత్తర గోవా నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స పొందుతున్నట్లు ప్రకటించారు. అయితే తనకు కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని కానీ పరీక్షలో పాజిటివ్ అని తేలిందని చెప్పుకొచ్చారు.


‘‘ఈరోజు కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అయితే నాకు కోవిడ్-19 లక్షణాలు ఏవీ లేవు. ప్రస్తుతం మా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నాను. నాతో కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారు వెంటనే కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాను’’ అని శ్రీపాద్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-13T00:55:10+05:30 IST