కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-17T00:00:33+05:30 IST

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందంటూ..

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందంటూ ఆయన స్వయంగా ఇవాళ ట్విటర్లో వెల్లడించారు. గడచిన రెండు, మూడు రోజుల్లో తనకు సమీపంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 70 ఏళ్ల జవదేకర్ ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రసారాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ పరిశ్రమలు సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ‘‘నాకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. గత రెండు, మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా స్వచ్ఛందగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను..’’ అని జవదేకర్ ట్వీట్ చేశారు. కాగా తాజాగా కరోనా బారిన పడిన రాజకీయ ప్రముఖుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-04-17T00:00:33+05:30 IST