Union Minister Paras: నా ప్రాణానికి ముప్పు ఉంది, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-08-27T14:21:46+05:30 IST

సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రి తన ప్రాణాలకు ముప్పు ఉందని, జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కోరిన ఘటన దేశంలో సంచలనం రేపింది.

Union Minister Paras: నా ప్రాణానికి ముప్పు ఉంది, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతి

న్యూఢిల్లీ : సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రి తన ప్రాణాలకు ముప్పు ఉందని, జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కోరిన ఘటన దేశంలో సంచలనం రేపింది. రాజకీయ కుట్రల కారణంగా తన ప్రాణానికి ముప్పు ఉందని కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రి పరాస్...కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో అభ్యర్థించారు. మంత్రి పరాస్ తన భద్రతా సమస్యలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు కూడా లేఖ కూడా రాశారు. ఎల్జీపీకి చెందిన కేశవ్ సింగ్ ఫోన్ కాల్స్, మెసేజుల ద్వారా తనను బెదిరిస్తున్నారని మంత్రి పరాస్ ఆరోపించారు.


‘‘ఆగస్టు 23 న నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత బీహార్‌లోని తన నియోజకవర్గమైన హాజీపూర్‌లో పర్యటించగా   భారీ ప్రజా మద్దతు లభించడంతో నా రాజకీయ ప్రత్యర్థులు ఆశ్చర్యపోయారు.ఇటీవల హాజీపూర్ సందర్శన సందర్భంగా నా ప్రత్యర్థులు నియమించిన వ్యక్తుల గుంపు ద్వారా నా అశ్వికదళానికి నల్లజెండాలు చూపించారు.  ఆయిల్ కూడా విసిరారు’’ అని మంత్రి పరాస్ చెప్పారు. తన పార్టీ నాయకుల్లో మరి కొంతమందికి కూడా బెదిరింపులు వచ్చాయని పరాస్ పేర్కొన్నారు.తాను కేంద్రమంత్రి, బీహార్ ఎంపీని, ఎల్జీపీ పార్టీ అధ్యక్షుడినని తనకు సరైన భద్రత కల్పించడం పరిపాలన బాధ్యత అని పరాస్ వివరించారు.

Updated Date - 2021-08-27T14:21:46+05:30 IST