తోటి ప్రయాణికుడిని కాపాడిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2021-11-18T00:07:37+05:30 IST

అస్వస్తకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణ చికిత్స అందించిన కేంద్ర మంత్రికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి చూపిన ఈ చొరవపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు..

తోటి ప్రయాణికుడిని కాపాడిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: అస్వస్తకు గురైన తోటి ప్రయాణికుడికి తక్షణ చికిత్స అందించిన కేంద్ర మంత్రికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రమంత్రి చూపిన ఈ చొరవపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. కేంద్రమంత్రి భాగవత్ కరాడ్‌ మంగళవారం ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు. అయితే విమానం గాల్లో లేచిన కాసేపటికే ఓ ప్రయాణికుడికి రక్తపోటు వచ్చింది. బీపీ బాగా పడిపోయింది. దాంతో వెంటనే అతడు కళ్లు తిరిగి పడిపోయాడు. వృత్తిరిత్యా వైద్యుడైన ఆయన ప్రయాణికుడికి చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. తోటి ప్రయాణికుడికి తక్షణ చికిత్స అందించిన కేంద్ర మంత్రి కరాడ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ వైద్యుడిగానే ఉన్నారని, నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారంటూ మెచ్చుకున్నారు.

Updated Date - 2021-11-18T00:07:37+05:30 IST