రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
ABN , First Publish Date - 2021-04-17T06:01:30+05:30 IST
మండలంలో కేఎల్పురం గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ మీద సుమారు 50 సంవత్సరాలుగల మహిళ రైలు ఢీకొని మృతి చెందింది.
గరివిడి, ఏప్రిల్ 16: మండలంలో కేఎల్పురం గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ మీద సుమారు 50 సంవత్సరాలుగల మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. చామనఛాయ రంగు, ఐదు అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు పాలిస్టర్ చీర, నలుగు, గులాబి రంగు ఉన్న జాకెట్టు ధరించినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. వివరాలకు 7013273731 నెంబర్కు ఫోన్ చేయాలని ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.