వైభవంగా ఊంజల్ సేవ
ABN , First Publish Date - 2021-02-26T04:23:27+05:30 IST
మార్కాపురం పట్టణ శివార్లలో వెలసివున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆఖరి రోజు వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు.
మార్కాపురం (వన్టౌన్) ఫిబ్రవరి 25 : మార్కాపురం పట్టణ శివార్లలో వెలసివున్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరుని 14వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఆఖరి రోజు వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉదయం అర్చకులు శుప్రభాత సేవ, అలంకారం, చతుర్వేద పారాయణం నిర్వహించారు. అనంతరం ఆచార్య, అర్చక సన్మానం, పండిత సత్కారం ఆలయ కమిటీ అధ్యక్షులు చెక్కా మాలకొండ నరసింహారావు, కార్యదర్శి ఆర్కేజే నరసింహం, కోశాధికారి ఊటుకూరి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉభయదాతలుగా మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కా లక్ష్మీప్రకాశ్ రావు, గుంట్ల వెంకటరాంబాబు పాల్గొన్నారు.