అభివృద్ధి పనులు చేపట్టండి
ABN , First Publish Date - 2020-06-07T07:58:59+05:30 IST
ఆర్థికంగా వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే
కలెక్టర్కు ఆదిమూలం వినతి
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 6: ఆర్థికంగా వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. శనివారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ భరత్గుప్తాను కలసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.15 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. నాగలాపురం, నారాయణవనంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి చేయాలనీ, పీఆర్ అతిథిగృహాన్ని వినియోగంలోకి తేవాలని కోరారు. మాజీ జడ్పీటీసీ బీరేంద్రవర్మ, వరదయ్యపాళెం సింగిల్విండో అధ్యక్షుడు హరి పాల్గొన్నారు.