మోదీ నాయకత్వంలో కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-01-24T01:42:54+05:30 IST

ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం కలిసికట్టుగా కరోనాపై విజయవంతమైన పోరాటం..

మోదీ నాయకత్వంలో కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం: అమిత్‌షా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం కలిసికట్టుగా కరోనాపై విజయవంతమైన పోరాటం సాగించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అసోంలోని గౌహతిలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్‌షా శనివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా తొలినాళ్లలో 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, అందునా రెండవ తరగతి మౌలిక వసతులతో ఎలా ఎదుర్కొంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయని అన్నారు. అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంతా సమష్టి పోరాటం సాగించామని చెప్పారు. 2020 సంవత్సరం ప్రపంచం ముందు, మానవాళి ముందు అనేక సవాళ్లను ఉంచిందని, అరుదుగానే మానవాళికి ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. ప్రపంచమంతా ఈ సమస్యలను ఎదుర్కొందని, మోదీ నాయకత్వంలో భారతదేశం విజయవంతంగా ఈ సమస్యలను ఎదుర్కొందని చెప్పారు. ఆయుష్మాన్ సీఆర్‌పీఎఫ్ స్కీమ్‌ను అమిత్‌షా ప్రారంభిస్తూ, దేశంలోని సీఏపీఎఫ్ జవాన్లు అందరికీ మే 1వ తేదీ కల్లా పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - 2021-01-24T01:42:54+05:30 IST