వేధిస్తున్నాడంటూ కోడలి ఫిర్యాదు.. మామ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-08T21:51:06+05:30 IST

మామపై కోడలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతో మామ ఆత్యహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నెహ్రునగర్‌

వేధిస్తున్నాడంటూ కోడలి ఫిర్యాదు.. మామ ఆత్మహత్య

ఇల్లెందురూరల్‌ (ఖమ్మం): మామపై కోడలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్న మనస్తాపంతో మామ ఆత్యహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నెహ్రునగర్‌ తండాలో మంగళవారం జరిగింది. నెహ్రునగర్‌కు చెందిన మాలోత్‌ దేవ్లా(50)కి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా పెద్ద కుమారుడైనా వీరన్న భార్య విజయ తన మామ తనను వేదిస్తున్నాడని సోమవారం ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తనపై కొడలే తప్పుడుగా ఫిర్యాదు చేసిందని మనస్తాపంతో శుక్రవారం ఉదయం పొలంకు వెళ్లి వస్తానని చెప్పి పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దేవ్లా మృతదేహానికి పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.

సింగరేణి కార్మికుడు..
సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని ఓసి-2 గనిలో హెడ్‌ ఓవర్‌మన్‌గా పనిచేసే పరకాల నర్సింహారావు (52) మంగళవారం తన క్వార్టర్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్సింహరావు  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జనవరిలో పక్షవాతమొచ్చి వైద్య చికిత్సలు తీసుకున్నాడు. మనోవేదనతో బాధపడుతున్నాడు. భార్య భారతి తల్లి కర్మలకోసం పెద్దకూతురుతో కలసి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంటో చిన్న కూతురుతోపాటు ఉన్న నర్సింహారావు కూతురు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-08T21:51:06+05:30 IST