మహిళ దారుణ హత్య
ABN , First Publish Date - 2021-01-16T05:39:29+05:30 IST
జనసంచారం లేని పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
పత్తికొండరూరల్, జనవరి 15: జనసంచారం లేని పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని హోసూరు- జోహరాపురం గ్రామాల నడుమ గుర్తు తెలి యని మహిళ (35) దారుణహత్యకు గురైంది. బండరాళ్లతో బాదడంతో తల ఛిద్రమైపోయింది. ఉదయం అటువైపు పొలాలకు వెళ్లిన రైతులు గమనించిన పత్తికొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆదినారా యణరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని జరిగిన విచారణ చేపట్టారు. ఆస్పరి మండలంలోని గ్రామాలతో పాటు పత్తికొండ పరిసర ప్రాంతాల్లో హత్యకు గురైన మహిళ గురించి ఆరా తీశారు. మృతదేహాన్ని పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయరెడ్డి తెలిపారు.