ఉచితంగా గొడుగుల పంపిణీ
ABN , First Publish Date - 2022-05-21T04:56:29+05:30 IST
ఉచితంగా గొడుగుల పంపిణీ
మొయినాబాద్, మే 20: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సహకారంతో మండలంలోని కార్మికులకు, చిరువ్యాపారులకు సౌకర్యంగా ఉండే గొడుగులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ గొడుగులు ఎండా, వానకు తట్టుకునే విధంగా ప్రత్యేకంగా ఉండడంతో కార్మికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గొడుగుపై ‘కొండా విశ్వేశ్వర్రెడ్డి నీడ’ అని రాసి ఉంది. మండలంలో కూలీలకు, రైతులు, చిరువ్యాపారులకు వెయ్యి మంది వరకు ఈ గొడుగులను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.