funeral: కాసేపట్లో ఉమామహేశ్వరి భౌతికకాయానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-08-03T16:04:29+05:30 IST
ఉమామహేశ్వరి భౌతికకాయానికి బుధవారం మహాప్రస్థానంలో 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి (Umamaheswarari) భౌతికకాయానికి బుధవారం మహాప్రస్థానంలో 11 గంటలకు అంత్యక్రియలు (funeral) జరగనున్నాయి. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల కుటుంబం అమెరికా నుంచి బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుని తల్లి పార్ధివ దేహానికి నివాళులర్పించారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా నివాళులర్పించారు. మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ, ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కళ్యాణ్రామ్ తదితరులు జూబ్లీహిల్స్లోని ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. కాగా ఆగస్టు నెల ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం మిగిల్చింది. 2018 ఆగస్టులో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంతకుముందు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జానకి రామకృష్ణ కూడా ఆగస్టులోనే మరణించారు.