ఉక్రెయిన్లో భారత విద్యార్థుల బందీ అంశంపై కేంద్రం కీలక ప్రకటన
ABN , First Publish Date - 2022-03-03T15:10:35+05:30 IST
ఉక్రెయిన్లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు బందీలుగా ఉండటంపై తమకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది. ‘‘ఉక్రెయిన్లోని మా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపుకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు’’ అంటూ కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది.