జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T05:22:45+05:30 IST

జిల్లా ప్రజలకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కలెక్టర్‌ హరికిరణ్‌లు ఒక ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందడంతో తెలుగు నేలపై ప్రతి గుమ్మం ముందు ప్లవనామ సంవత్సర ఉగాది స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

కడప(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 12: జిల్లా ప్రజలకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కలెక్టర్‌ హరికిరణ్‌లు ఒక ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందడంతో తెలుగు నేలపై ప్రతి గుమ్మం ముందు ప్లవనామ సంవత్సర ఉగాది స్వాగతం పలుకుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మీయ బంధానికి గుర్తు చేసే పర్వదినం ఉగాది అని, జీవన గమనంలో కష్ట, సుఖాలు సహజమే అనే సత్యాన్ని ఆరు రుచులు మేళవించిన ఉగాది పచ్చడి తెలియజేస్తుందన్నారు. ప్రతిఒక్కరూ సంప్రదాయాలను గౌరవిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాక్షించారు. కాగా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎస్పీ అన్బురాజన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్‌ కలెక్టర్లు ఎం.గౌతమి, సాయికాంత్‌వర్మ, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-04-13T05:22:45+05:30 IST