డాక్టర్‌ గాయత్రీ దేవికి ఉగాది పురస్కారాలు

ABN , First Publish Date - 2021-04-13T06:21:20+05:30 IST

తెలుగు భాష ఔచిత్యం, తెలుగు సాహిత్యం కోసం ప్రముఖ వేదపండితురాలు డాక్టర్‌ వేదాల గాయత్రీదేవి చేస్తున్న కృషిని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలోని పలు సాహితీ సంస్థలు ఆమెను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేశారు.

డాక్టర్‌ గాయత్రీ దేవికి ఉగాది పురస్కారాలు
డాక్టర్‌ గాయత్రీ దేవికి ఉగాది పురస్కారాలు



నక్కపల్లి, ఏప్రిల్‌ 12 : తెలుగు భాష ఔచిత్యం, తెలుగు సాహిత్యం కోసం ప్రముఖ వేదపండితురాలు డాక్టర్‌ వేదాల గాయత్రీదేవి చేస్తున్న కృషిని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలోని పలు సాహితీ సంస్థలు ఆమెను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేశారు. కరీంనగర్‌ మహతీ సాహితీ కవి సంగమం సంస్థ కవితా పండుగలో భాగంగా గాయత్రీదేవి చేసిన ఉత్తమ కవిత,  రచనలకు ఉగాది పురస్కారం అందజేయనుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.సదయ్య తెలిపారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ సాహిత్య పరిషత్‌ కూడా 2021లో ఉత్తర వాహిని పురస్కారానికి డాక్టర్‌ గాయత్రీదేవిని ఎంపిక చేశారు. మార్చి 9న జరిగిన జిల్లా సాహిత్య సదస్సులో గాయత్రీదేవి ప్రవచనాలకు ఈ పురస్కారం లభించింది. 


Updated Date - 2021-04-13T06:21:20+05:30 IST