ఫంక్షన్ నుంచి వచ్చి షాక్‌కు గురైన బాలిక.. రెండ్రోజుల తర్వాత ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన తల్లిదండ్రులు..

ABN , First Publish Date - 2022-08-16T22:59:01+05:30 IST

ఆ బాలిక పండగ సెలబ్రేషన్స్ కోసం తమ పక్క గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది..

ఫంక్షన్ నుంచి వచ్చి షాక్‌కు గురైన బాలిక.. రెండ్రోజుల తర్వాత ఆమె చెప్పింది విని నివ్వెరపోయిన తల్లిదండ్రులు..

ఆ బాలిక పండగ సెలబ్రేషన్స్ కోసం తమ పక్క గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది.. పండగ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లింది.. అయితే ఆ బాలిక స్థబ్ధుగా ఉండడం చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.. రెండ్రోజుల తర్వాత మామూలు స్థితిలోకి వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది.. తనపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పింది.. షాకైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఇది కూడా చదవండి..

అత్తమామలు, భార్య వేధింపులు.. విసుగు చెందిన ఆ యువకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే..


మధ్యప్రదేశ్‌ (Madhya pradesh)లోని రేవాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఈ నెల 12వ తేదీన తమ పక్క గ్రామంలో కజ్లియన్ పండుగ జరుపుకుని తిరిగి ఇంటికి వెళ్తోంది. దారిలో నిర్మానుష్య ప్రదేశంలో సుఖ్‌లాల్, వినోద్ అనే వ్యక్తులు ఆ బాలికను అడ్డగించారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఆమెను సమీపంలోని ఓ కొండ పైకి లాక్కెళ్లారు. ఇద్దరూ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. తీవ్ర షాక్‌కు గురైన బాలిక అక్కడే కొద్ది గంటల పాటు ఉండిపోయింది. 


ఆ తర్వాత తేరుకుని ఎలాగోలా ఇంటికి చేరుకుంది. ఇంట్లో కూడా రెండ్రోజుల పాటు ఏడుస్తూ ఉండిపోయింది. తల్లిదండ్రులు ఏం అడిగినా మాట్లాడేది కాదు. రెండ్రోజుల తర్వాత తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 14న బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు ఆమెను మెడికల్ చెకప్‌నకు పంపించారు. సోమవారం సాయంత్రం నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-08-16T22:59:01+05:30 IST