వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-29T06:02:17+05:30 IST
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పురుగులు మందు తాగి ఒకరు, ఉరి వేసుకుని మరొకరు..
మల్కాపురం, సెప్టెంబరు 28: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీహరిపురం పాత రామలయం వీధికి చెందిన సూరాడ బంగార్రాజు (30) ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు అధికంగా వుండడంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని శ్రీహరిపురంలోని యారాడ పార్కు గేటు వద్ద ఆటోను నిలిపివేసి మద్యంలో పురుగులు మందు కలుపుకుని తాగి ఆటోలో పడిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు బంగార్రాజును లేపడానికి ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. దీంతో కేజీహెచ్కు తరలించగా అప్పటికే బంగార్రాజు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఉరి వేసుకుని రాడ్ బెండర్..
అల్లూరి సీతారామారాజు కాలనీకి చెందిన జి.రాజేశ్ (27) రాడ్ బెండర్గా పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లిన రాజేశ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా కుమారుడు ఉరి వేసుకుని కనిపించడంతో బావురుమంటూ చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలిపింది. స్థానికులు రాజేశ్కు కిందకు దించి చూసేసరికే మృతి చెంది ఉన్నాడు. రాజేశ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రెండు కేసులను సీఐ లూథర్బాబు, ఎస్ఐ దేవుడమ్మ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.