బుద్గాంలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-10-28T11:24:01+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని బుద్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు...

బుద్గాంలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

బుద్గాం (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని బుద్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాంలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతాదళాలతో కలిగి గాలింపు చేపట్టారు. జవాన్లు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తాము ఎదురుకాల్పులు జరిపామని, ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం తెలిపారు. బుద్గాంలోని అరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం బుధవారం ఉదయం కూడా గాలిస్తూనే ఉన్నారు. 

Updated Date - 2020-10-28T11:24:01+05:30 IST