కుల్గాంలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-10-10T13:36:59+05:30 IST

జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది....

కుల్గాంలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

కుల్గాం (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో శనివారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు కొనసాగుతోంది. అక్టోబరు 7న షోపియాన్ జిల్లా సుగన్ జైనపురాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.


సెప్టెంబరు 27వతేదీన అవంతిపురా జిల్లాలోని సాంబూరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.వరుస ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

Updated Date - 2020-10-10T13:36:59+05:30 IST