కువైట్లో కరోనాతో ఇద్దరు తెలుగు కార్మికులు మృతి..
ABN , First Publish Date - 2020-05-28T18:18:10+05:30 IST
గల్ఫ్లో ఉన్న జిల్లా వాసులు ఇద్దరు కరోనాతో మృతి చెందారు. గోపవరం మండలంలోని ఎస్.రామాపురానికి చెందిన మల్లెం కొండారెడ్డి (60) కువైత్లో 30 ఏళ్లుగా ఉంటున్నారు.
గోపవరం/రామాపురం (కడప): గల్ఫ్లో ఉన్న జిల్లా వాసులు ఇద్దరు కరోనాతో మృతి చెందారు. గోపవరం మండలంలోని ఎస్.రామాపురానికి చెందిన మల్లెం కొండారెడ్డి (60) కువైత్లో 30 ఏళ్లుగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో అక్కడ చికిత్స పొందుతూ 21వ తేదీ మృతిచెందారు. కొండారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామాపురం మండలం నీలకంట్రావుపేటకు చెందిన దర్బార్బాషా (53) రెండు సంవత్సరాల నుంచి సౌదీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈయన కరోనాతో మరణించాడని సౌదీ నుంచి మంగళవారం కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.