ఇద్దరు విద్యార్థులకు Covid
ABN , First Publish Date - 2021-11-26T15:06:15+05:30 IST
మదురై కామరాజర్ విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగంలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరినీ హౌం క్వారంటైన్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. బాధిత విద్యార్థులు హాస్టల్
- కామరాజర్ వర్సిటీ మూసివేత
పెరంబూర్(చెన్నై): మదురై కామరాజర్ విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగంలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరినీ హౌం క్వారంటైన్లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. బాధిత విద్యార్థులు హాస్టల్ వుండి చదువుకుంటుండడంతో ఆక్కడ బసచేస్తున్న 247 మంది విద్యార్థులు, వార్డన్లు, విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు నిర్ణయించారు. దీంతో, వారం రోజులు వర్సిటీ మూసి వేస్తున్నట్టు, ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామని వర్శిటీ యాజమాన్యం తెలియజేసింది.