రెండు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2022-05-19T04:42:03+05:30 IST
మండలంలోని మనుబోలు జాతీయరహదారిపై బుధవారం రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. బద్దెవోలు క్రాస్రోడ్డు సమీపంలో కారును లారీ డీ కొట్టింది. కారులో నలుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మనుబోలు, మే 18: మండలంలోని మనుబోలు జాతీయరహదారిపై బుధవారం రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. బద్దెవోలు క్రాస్రోడ్డు సమీపంలో కారును లారీ డీ కొట్టింది. కారులో నలుగురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనుబోలు వద్ద ముందు వెళుతున్న టిప్పర్ను అధిగమించబోయి నెల్లూరు వెళుతున్న కారు వెనుకబాగంలో ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్, బాలమురళికి స్వల్ప గాయాలయ్యాయి. తిరుపతి నుంచి నెల్లూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని 108 సిబ్బంది ప్రథమచికిత్స చేసి గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.