ఇద్దరు మంత్రులకు Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-12T18:25:40+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి బొమ్మైతోపాటు ఇప్పటివరకు నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్‌ సోకింది. ఇప్పటికే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ కరోనా బారినపడగా ఇటీవల రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్‌కు పాజిటివ్‌

ఇద్దరు మంత్రులకు Covid పాజిటివ్‌

బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి బొమ్మైతోపాటు ఇప్పటివరకు నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్‌ సోకింది. ఇప్పటికే ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ కరోనా బారినపడగా ఇటీవల రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్‌కు పాజిటివ్‌ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి జేసీ మాధుస్వామి, సహకారశాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌లకు మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కాగా ముఖ్యమంత్రి బొమ్మై మంగళవారం ఉ దయం వరకు తన నివాసంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మద్యాహ్నం తర్వాత నలత అనిపించడంతో వైద్యుల సూచన మేరకు మణిపాల్‌ ఆసుపత్రిలో చేరారు. కొవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్పకు పాజిటివ్‌ రావడంతో ఆయన కూడా మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. యడియూరప్ప తరహాలోనే బొమ్మై కూడా ఆసుపత్రి నుంచే ఫైళ్లను పరిశీలించారు. 

Updated Date - 2022-01-12T18:25:40+05:30 IST