ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2021-04-17T05:51:23+05:30 IST
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు రావులపాలెం ఎస్ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.
రావులపాలెం రూరల్, ఏప్రిల్ 16: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు రావులపాలెం ఎస్ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. వివరాలు ఇలా వున్నాయి... మండపేటకు చెందిన కొమ్ము సుధాకర్, రాజమహేంద్రవరం కంబాలచెరువుకు చెందిన పోలాకి లక్ష్మీనాగేంద్రలను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రావులపాడు వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ ఇద్దరూ ఎటువంటి పత్రాలు లేని మోటారు సైకిళ్లపై తారసపడడంతో వారిని అదుపులోకితీసుకుని విచారించగా ఐదు బైక్లు దొంగిలించినట్టు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.