శ్రీనగర్‌లో encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2022-02-05T14:00:13+05:30 IST

జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్ విభాగాలకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

శ్రీనగర్‌లో encounter...ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా, రెసిస్టెన్స్ ఫ్రంట్ విభాగాలకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ నగరంలోని జకూర ప్రాంతంలో శనివారం భద్రతాబలగాలకు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఇఖ్లాఖ్ హాజమ్ మరణించాడని కశ్మీర్ జోన్ ఐజీ చెప్పారు. ఇఖ్లాఖ్ హాజమ్ ఇటీవల అనంత్ నాగ్ వద్ద హెడ్ కానిస్టేబుల్ ను హతమార్చాడని పోలీసులు చెప్పారు.మరణించిన ఉగ్రవాదుల వద్ద నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు.ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతుందని పోలీసులు వివరించారు.


Updated Date - 2022-02-05T14:00:13+05:30 IST