జగిత్యాల జిల్లాలో ఇద్దరి హత్య

ABN , First Publish Date - 2022-01-15T06:00:24+05:30 IST

మల్లాపూర్‌ మండలంలోని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్వగ్రామమైన రాఘవపేటలో గ్రామంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు మామిడి లక్ష్మయ్య(50) శుక్రవారం దారుణ హత్యకు గుర య్యాడు.

జగిత్యాల జిల్లాలో ఇద్దరి హత్య
రక్తపు మడుగులో పడి ఉన్న చంద్రయ్య

వెల్గటూర్‌లో ఒకరు..మల్లాపూర్‌లో మరొకరు

మల్లాపూర్‌, జనవరి 14: మల్లాపూర్‌ మండలంలోని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్వగ్రామమైన రాఘవపేటలో గ్రామంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు మామిడి లక్ష్మయ్య(50) శుక్రవారం దారుణ హత్యకు గుర య్యాడు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మ య్య శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన వ్యక్తితో గొడవ పడ్డాడు. గొడవ ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో లక్ష్మయ్యను రాళ్లతో కొట్టిన వ్యక్తి అనంతరం కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మయ్యను వెంటనే స్థానికులు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. 

కొడుకు చేతిలో తండ్రి..

వెల్గటూర్‌ : వెల్గటూర్‌ మండలంలోని సూరారం గ్రామంలో తనయు డి చేతిలో తండ్రి హత్యకు గురయ్యాడు. దుర్గం చంద్రయ్య (45) అనే వ్యక్తిని అతని కొడుకు దుర్గం పవన్‌ కర్రతో కొట్టడంతో గాయాలై మృతి చెందాడు. ఎస్సై నరేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి చంద్రయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రం కావడంతో భార్యను కొట్టబోయాడు. అక్కడే ఉన్న చంద్రయ్య పెద్ద కొడుకు పవన్‌ కర్రతో ఆవేశంగా తండ్రి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో చంద్రయ్యకు తీవ్ర గాయాలై కింద పడి పోయాడు. తెల్లవారి లేచి చూసే సరికి చంద్రయ్య తల భాగం రక్తపు మడుగుకట్టి మృతి చెంది ఉన్నాడు. అది చూసిన కొడుకు పవన్‌ ఇంట్లో నుంచిపారిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-15T06:00:24+05:30 IST