వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-05-31T10:20:46+05:30 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

నంద్యాల (నూనెపల్లె), మే 30: జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నంద్యాల మండలం ఆటోనగర్‌ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మధు (27) అనే వ్యక్తి మృతి చెందాడు. పాణ్యంకు చెందిన మధు నంద్యాలలో తన భార్య ఉండటంతో వెంట తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై పాణ్యం నుంచి నంద్యాలకు బయలు దేరాడు. ఈ క్రమంలో నందికొట్కూరు క్రాస్‌ రోడ్డు - ఆటోనగర్‌ మధ్య జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం మధు ద్విచక్ర వాహానాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-31T10:20:46+05:30 IST