కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-21T05:38:26+05:30 IST

మండల పరిధిలోని ఆరికతోట, బూసాయవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట, బూసాయవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం శాంతినగర్‌కు చెందిన షేక్‌ రహమతుల్లా అలియాస్‌ అబ్బాస్‌, షేక్‌ సలీమ్‌లు బైకుపై విజయనగరం నుంచి సాలూలు వైపు వెళుతుండగా బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు ఢీకొంది. దీంతో వీరిద్దరికి గాయాల య్యాయి. వీరిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-21T05:38:26+05:30 IST